Saturday, 9 December 2017

జీఎస్టీ తీసుకో..
          జేబులో వేసుకో

 అక్రమంగా వసూళ్లు
ఖజానాకు జమ చేయని
వ్యాపారులు రూ. కోట్లలో గండి
పార్కింగ్‌లు, హోటళ్లలో మరీ ఎక్కువ

       వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తీసుకొచ్చిన నేపథ్యంలో తనిఖీల పేరు చెప్పి వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దని, ఏడాదివరకు ఈ వెసులుబాటు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీన్ని ఆసరాగా తీసుకుని చాలామంది వ్యాపారులు.. వసూలు చేసిన పన్నును కూడా ప్రభుత్వానికి జమ చేయడం లేదని వాణిజ్య పన్నులశాఖ పరిశీలనలో తేలింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2.7 లక్షల మంది జీఎస్టీఎన్‌ తీసుకున్నారు. వీరిలో చాలామంది రిటర్న్‌లు దాఖలు చేయడం లేదని కేంద్ర జీఎస్టీ, రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించారు. వసూలు చేస్తున్న పన్నును జమ చేయకపోవడం లేదంటే తక్కువ జమ చేసి మిగిలింది స్వాహా చేస్తుండటం వంటివి ప్రాథమిక పరిశీలనలో వెల్లడయ్యాయి. ప్రధానంగా హోటళ్లు, పార్కింగ్‌ యజమానులు, రిటైల్‌ వ్యాపారులు ఈ అవకతవకలకు పాల్పడుతున్నట్లు తేలింది.
పార్కింగ్‌లో మోత:  పార్కింగ్‌ రుసుమును 18 శాతం జీఎస్టీ పరిధిలోకి చేర్చారు. హైదరాబాద్‌ సహా నగరాలు, పట్టణాల్లో వేల సంఖ్యలో పార్కింగ్‌ ప్రదేశాల్లో నిత్యం లక్షల వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. వీటి ద్వారా పార్కింగ్‌ ఛార్జీలతో పాటు సేవా పన్నును ప్రత్యేకంగా వసూలు చేస్తున్నారు. జీఎస్టీ గుర్తింపు సంఖ్య తీసుకున్నవారు మాత్రమే పన్ను వసూలు చేయాలి. వసూలు చేసిన పన్నుకు రిటర్న్‌లు దాఖలు చేసి పన్నును ప్రభుత్వానికి జమ చేయాలి. చాలా మంది పన్ను వసూలు చేస్తున్నా రిటర్న్‌లు దాఖలు చేయడం లేదు. పన్నును పూర్తిగా జమ చేయడం లేదు. జీఎస్టీఎన్‌ లేకున్నా సేవా పన్ను వసూలు చేస్తుండడం మరో దోపిడీ. పార్కింగ్‌ ప్రదేశాల్లో ఎక్కువచోట్ల పుస్తకాల్లోని రశీదులిచ్చి వసూలు చేస్తున్నారు. నామమాత్రంగా ఒరిజనల్‌ పుస్తకాలను చూపి నకిలీ పుస్తకాలతో పెద్ద మొత్తంలో పన్ను ఎగవేస్తున్నారు. దుకాణ సముదాయాలు,బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పార్కింగ్‌ నిర్వాహకులు భారీగా పన్ను ఎగవేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతంలో ఉండే ఓ పార్కింగ్‌ యజమాని గంటల ప్రాతిపదికన పార్కింగ్‌ ఛార్జీలు, సేవా పన్ను వసూలు చేస్తున్నారు. జీఎస్టీ గుర్తింపు సంఖ్య ఉన్నా అది కొన్ని పుస్తకాలకే పరిమితమవుతోంది. ఎక్కువభాగం నకిలీ రశీదులతోనే పార్కింగ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రశీదును వాహనం తీసుకెళ్లేటప్పుడు వెనక్కి తీసేసుకుంటుండడంతో లెక్కకు దొరకడం లేదు.
హోటళ్లలో బాదుడే: ఒక మోస్తరు నుంచి పెద్ద హోటళ్లలో జీఎస్టీ వసూలు చేస్తున్నారు.  నిత్యం రద్దీగా ఉండే పలు హోటళ్లు ఐదు శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నా తక్కువ మొత్తంలో జమ చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని, నిత్యం లక్షల వ్యాపారం జరుగుతున్నా నామమాత్రంగా పన్ను చెల్లిస్తున్నారని తేలింది. వసూలు చేసిన పన్నును ప్రభుత్వానికి జమ చేయకపోయినా, ఎక్కువ వసూలు చేసినా, జీఎస్టీ గుర్తింపు సంఖ్యలేకుండా వసూలు చేసినా చర్యలు తీసుకోవచ్చు.
పన్ను తగ్గినా ధర తగ్గదేం?
నవంబర్‌లో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో 202 వస్తువులు, సేవలపై పన్ను రేట్లు తగ్గించారు. నవంబరు 15 నుంచి తగ్గిన పన్ను రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ సమావేశంలోనే ఏసీ, నాన్‌ ఏసీ హోటళ్లలో జీఎస్టీని 18 నుంచి ఐదు శాతానికి తగ్గించారు. అయితే ఈ ప్రయోజనాలేవీ వినియోగదారుణ్ని చేరడం లేదు. గతంలో ఉన్న రేట్లతోనే వస్తువులను విక్రయిస్తూ జీఎస్టీని మాత్రం 5 లేదా 12 శాతంగా చూపుతున్నారు.
* హోటల్‌ బిల్లుపై జీఎస్టీ 5 శాతానికి తగ్గినా ఆ మేరకు పదార్ధాల ధరలు పెంచేస్తున్నారు. దీంతో బిల్లు తగ్గడం లేదని వినియోగదారులు చెబుతున్నారు.
* చిల్లర వ్యాపారులదీ ఇదే దారి. జీఎస్టీఎన్‌ తీసుకోకున్నా కొత్త రేట్లతో విక్రయిస్తున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే జీఎస్టీతో అన్ని ధరలు పెరిగాయని దబాయిస్తున్నారు
Happy birthday raహబక్స్ఛ్సీఛ్థిజె

Tuesday, 21 November 2017

సంకటహర చతుర్థి_sankatahara chaturth








స‌క‌ల విఘ్నాల‌కు అధిప‌తి ఆదిదంప‌తుల కుమారుడైన వినాయ‌కుడు. ఆయ‌న‌ను పూజిస్తే అన్నిసంక‌టాలు తొల‌గిపోతాయి. అందుక‌నే ప్ర‌తిమాసంలో పౌర్ణ‌మి అనంత‌రం వ‌చ్చే చ‌తుర్థినాడు సంకటహర చతుర్థిని నిర్వ‌హిస్తాం. దీనినే సంక‌ష్ట‌హార చ‌తుర్థి అని కూడా అంటారు. చ‌వితికి అధప‌తి వినాయ‌కుడు. స్వామిని ఈ రోజున నిండుమ‌న‌సుతో కొలిస్తే అన్ని సంక‌టాలు తొల‌గిపోతాయ‌ని గ‌ణ‌ప‌తిపురాణం పేర్కొంటుంది. సాధార‌ణంగా ఈ పూజ చేసేవారు ఆ రోజున ఉప‌వాస‌ముండాలి.సాయంత్రం చంద్ర‌ద‌ర్శ‌నం త‌రువాత విర‌మించాలి. స‌మీప గ‌ణ‌ప‌తి ఆల‌యంలో జ‌రిగే సంక‌ట‌హార‌చ‌తుర్థి వ్ర‌తంలోపాల్గొనాలి. వినాయ‌క‌చ‌వితిరోజున చంద్రున్ని చూడ‌కూడ‌దు. అయ‌తే సంక‌ట‌హార చ‌తుర్థి రోజున చంద్రున్ని చూడాలి. మంగ‌ళ‌వారంనాడు వ‌చ్చే సంక‌ట‌హార‌చ‌తుర్థిని అంగార‌క చ‌తుర్థి అంటారు. ఆ రోజున ఈ వ్ర‌తంనిర్వ‌హిస్తే మ‌రిన్ని మంచి ఫ‌లితాలు ల‌భిస్తాయి.









సంకష్టహర గణపతి


గణేశుని వ్రతాలలో అత్యంత ప్రభావవంతమైనదీ, సర్వ సంకటాలను నివారించేదీ సంకష్టహర గణపతి వ్రతం. గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.


సంకటహర గణపతి :
సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూగణేశుని వ్రతాలలో అత్యంత ప్రభావవంతమైనదీ, సర్వ సంకటాలను నివారించేదీ సంకష్టహర గణపతి వ్రతం. గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.


సంకటహర గణపతి :
సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ ఆదివారం మరియు మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి.


వ్రత కథ :
పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.జింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి.


వ్రత కథ :
పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.